News July 19, 2024
వినుకొండలో రషీద్ ఇంటికి చేరుకున్న YS జగన్

వైసీపీ అధినేత YS జగన్ కార్యకర్త రషీద్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట వినుకొండ చేరుకున్న ఆయన మృతుడు రషీద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరికాసేపట్లో జగన్ మీడియాతో మాట్లాడనుండగా.. ఏం మాట్లాడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.
News November 7, 2025
GNT: రెండవ శనివారం సెలవుపై సడలింపు..రేపు స్కూల్స్కి హాలిడే

తుఫానుకు 4 రోజులు ఇచ్చిన సెలవులను భర్తీ చేస్తూ 2వ శనివారం కూడా స్కూల్స్ పనిచేస్తాయని చేసిన ప్రకటనను సడలించారు. గత నెల 23న అన్ని పాఠశాలలు తమ స్థానిక సెలవులలో ఒకదాన్ని వినియోగించుకోవడం వల్ల 8వ తేదీ 2వ శనివారం పని చేయవలసిన అవసరం లేదని తమకు సమాచారం వచ్చినట్లు తెనాలి ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మిగిలిన 3 సెలవులను ప్రొసీడింగ్స్లో జారీ చేసిన విధంగా వచ్చే 3 నెలల్లో 2వ శనివారాలతో భర్తీ చేసుకోవచ్చన్నారు.
News November 7, 2025
దుగ్గిరాలలో యువకుడి దారుణ హత్య

దుగ్గిరాలలోని వంతెన డౌన్లో రజకపాలెంకు చెందిన వీరయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


