News March 25, 2025

వినుకొండ: ఉద్యోగం పేరుతో భారీ మోసం

image

ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనపై బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వినుకొండకు చెందిన వెంకట్రావు బంధువు కుమారుడికి వసంతరావు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అందుకోసం వెంకట్రావు దగ్గర నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. దీంతో డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని గ్రివెన్స్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Similar News

News December 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్‌డ్ స్కిల్స్‌పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు

News December 10, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

image

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో నస్రుల్లాబాద్, మేనూర్, డోంగ్లీ గ్రామాలలో అత్యల్పంగా 7.8°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. బీర్కూరులో 7.9°C, బొమ్మన్ దేవిపల్లిలో 8.2°C, పెద్దకొడప్గల్‌లో 8.4°C, బిచ్కుందలో 8.7°C నమోదయ్యాయి. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలో చలి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News December 10, 2025

ఆదిలాబాద్: తెర వెనుక రాజకీయం షురూ

image

ఉమ్మడి జిల్లాలో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బహిరంగ ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెర వెనుక రాజకీయాలకు పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూ, గ్రామాల్లోని కీలక కుల సంఘాల పెద్దలను, ముఖ్య నాయకులను కలుస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతూ, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.