News March 23, 2025
వినుకొండ: ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య

వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుడు తెలుపు నిండు చేతులు చొక్కా, ఆకుపచ్చ నైట్ ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.
Similar News
News December 4, 2025
రైల్వే నాణ్యతపై ప్రయాణికులు సంతృప్తి!

భారతీయ రైల్వే ఏటా 58కోట్ల ప్యాక్డ్ మీల్స్ను ప్యాసింజర్స్కు అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో నాణ్యతపై అందిన ఫిర్యాదులు 0.0008 శాతమేనని పేర్కొంది. వీటిపై విచారణ జరిపి గత నాలుగేళ్లలో రూ.2.8కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. నాణ్యమైన ఆహారం అందించడానికి రైల్వే నిరంతరంగా కృషి చేస్తుందని స్పష్టం చేసింది. అయితే SMలో మాత్రం ఆహార నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.
News December 4, 2025
సూర్యాపేట: పోస్టల్ బ్యాలెట్లు జాగ్రత్తగా జారీ చేయాలి: కలెక్టర్

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ఓట్లను కౌంటింగ్ చేయడానికి తగిన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
సూర్య ఘర్పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


