News March 23, 2025

వినుకొండ: ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య

image

వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుడు తెలుపు నిండు చేతులు చొక్కా, ఆకుపచ్చ నైట్ ప్యాంటు ధరించినట్లు చెప్పారు. మృతుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

Similar News

News January 7, 2026

గుంటూరు: ఫిబ్రవరిలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

గుంటూరులో అగ్నివీర్ సైనిక నియామక ప్రక్రియను వచ్చే ఫిబ్రవరి 17-27 మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని పదిరోజులకు పైగా ర్యాలీ కొనసాగనుంది. ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ జరగనుండగా, దశలవారీగా శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ముందస్తుగా ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలి.

News January 7, 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 7, 2026

నల్గొండ: రూ.10వేల నుంచి రూ.40కోట్లకు!

image

నల్గొండ మున్సిపాలిటీ అరుదైన మైలురాయిని చేరుకుంది. 74 ఏళ్ల క్రితం కేవలం రూ.10 వేల వార్షిక బడ్జెట్‌తో ప్రారంభమైన ఈ మున్సిపాలిటీ ఆదాయం, నేడు రూ. 40 కోట్లకు పైగా పెరిగింది. వలసలు పెరగడంతో పట్టణ జనాభా ప్రస్తుతం 2.5 లక్షలు దాటింది. జనాభాకు అనుగుణంగా పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చిన్న ఆదాయ వనరుగా ఉన్న మున్సిపాలిటీ, నేడు కోట్ల ఆదాయంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.