News February 12, 2025

వినుకొండ: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో అంబేడ్కర్ నగర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని తెలిపారు.

Similar News

News February 13, 2025

దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

image

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

News February 13, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

News February 13, 2025

‘ద్రౌపది దాహం తీర్చుకున్న ప్రదేశమే భీముని కొలను’

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తూ ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పాడు. గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు కిందికి దూకాయి. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చింది.

error: Content is protected !!