News November 27, 2024
వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్.. నోటీసులు జారీ

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.
Similar News
News December 18, 2025
అమరావతి: పేరుకే రాజధాని.. అంబులెన్స్ రావాలంటే కష్టమే!

అమరావతి రాజధాని ప్రాంతంలో అంబులెన్స్ కొరత తీవ్రంగా వెంటాడుతుంది. రాజధాని ప్రాంతంలో రోజూ ఏదొక ప్రమాదం జరుగుతూ ఉన్నా అంబులెన్స్ మాత్రం అందుబాటులో ఉండకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణ బుధవారం రాత్రి రాయపూడిలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం. అంబులెన్స్కి ఫోన్ చేస్తే గుంటూరు, మంగళగిరి నుంచి రావడానికి గంటకు పైగా పడుతుందని స్థానికులు అంటున్నారు.
News December 18, 2025
GNT: ఈ సీజన్కి అయినా యార్డ్ ఛైర్మన్ పోస్ట్ భర్తీ అయ్యేనా?

గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ విషయంలో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల నుంచి ప్రారంభమవనున్న మిర్చి సీజన్లో యార్డులో కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఛైర్మన్ పదవిని భర్తీ చేయకపోవడంతో సొంత పార్టీ నాయకులే నైరాశ్యంలో ఉన్నారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆశావహులు మాత్రం ఈ సీజన్కి పదవి భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు.
News December 18, 2025
ANU: బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. II, IV 4వ సెమిస్టర్, lll, lV 6వ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్
https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.


