News November 27, 2024

వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్‌.. నోటీసులు జారీ 

image

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్‌లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్‌లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్‌, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.  

Similar News

News December 22, 2025

గుంటూరులో క్రీస్తు సేవ.. ఘన చరిత్ర కలిగిన చర్చిలు

image

క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో గుంటూరు చర్చిలు నడుస్తున్నాయి. AELC ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. 1842లో రెవరెండ్ హయ్యర్ స్థాపించిన సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చికి 150ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాగే 1905లో వెస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. నార్త్ ప్యారిస్ చర్చి 60ఏళ్లుగా సేవలందిస్తోంది. 1940లో ఏర్పాటైన గుంటూరు మేత్రాసనం ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.

News December 22, 2025

PGRSని సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజలు https://Meekosam.ap.gov.inలో లేదా నేరుగా అయినా అర్జీలను సమర్పించవచ్చని అన్నారు.1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమర్పించిన అర్జీల పురోగతిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 21, 2025

జిల్లాలో తొలిరోజే 97.9% పోలియో చుక్కల పంపిణీ: DMHO

image

గుంటూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. నిర్దేశించిన 2,14,981 మంది చిన్నారులకు గాను 2,08,735 (97.9%) మందికి చుక్కలు వేసినట్లు DMHO విజయలక్ష్మీ తెలిపారు. మురికివాడలు, ప్రమాదకర ప్రాంతాల్లోని 2,434 మందికి, ప్రయాణాల్లో ఉన్న 1,474 మందికి కూడా మందు వేశారు. ఆదివారం కేంద్రాలకు రాని పిల్లల కోసం సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామని ఆమె పేర్కొన్నారు.