News February 18, 2025

వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News January 11, 2026

గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల

image

AP: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3000 TMCల గోదావరి నీటిలో 200 TMCలను వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు APకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు SCలో విచారణ నేపథ్యంలో అధికారులు, లాయర్లతో VC నిర్వహించారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు.

News January 11, 2026

అన్నమయ్య జిల్లాలో రేపు అర్జీల స్వీకరణ

image

అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ద్వారా సోమవారం ప్రజల నుంచి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్‌లో నమోదు చేసుకోవచ్చని డీపీఆర్‌ఓ తెలిపారు. అవసరం అయితే మీకోసం కాల్ సెంటర్ 1100ను సంప్రదించగలరన్నారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలు సమస్యలను స్వీకరిస్తారని అన్నారు.

News January 11, 2026

టెట్ నుంచి ఆ టీచర్లకు ఊరట?

image

సుప్రీంకోర్టు <<17587484>>తీర్పు<<>> నేపథ్యంలో టీచర్లు కూడా టెట్ రాస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష సిలబస్‌లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట దక్కే అవకాశం ఉంది.