News February 9, 2025
విన్నర్గా పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు

గుంటూరులో నిర్వహించిన పారా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు శనివారం విన్నర్గా నిలిచింది. ఈ క్రమంలో ముఖ్య అతిథి 2024 పారా ఒలింపిక్ బ్రౌంగ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్ రుబీన ఫ్రాన్సిస్ చేతుల మీదగా విన్నర్ ట్రోఫీని ఈ జట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ కె.శ్రీను, వైస్ కెప్టెన్ జి.సంతోష్లను, క్రికెట్ జట్టును పలువురు అభినందిస్తున్నారు.
Similar News
News November 11, 2025
ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.
News November 11, 2025
భీమవరం: ‘మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు’.. నిందితుడి వీడియో వైరల్

భీమవరంలో తల్లి, తమ్ముడిని దారుణంగా గంట పాటు <<18246456>>పొడిచి చంపిన<<>> తర్వాత శ్రీనివాస్ రోడ్డుపైకి వచ్చి మాట్లాడిన మాటలు భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు. నా మనసులో ఏం అనుకున్నా వాళ్లకు తెలిసిపోతోంది. నాకు పిచ్చి అంటున్నారు’ అని చెప్పడం భయం కలిగించింది. కాగా అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు.
News November 11, 2025
నాయుడుపేట సెజ్లో రూ.3,038 కోట్ల పెట్టుబడి.. 2,265 మందికి జాబ్స్

మంత్రివర్గ సమావేశంలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సెజ్లో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఏపీటోమ్ కాంపోనెంట్స్ రూ.700 కోట్ల పెట్టుబడితో PCBలు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. వాల్ట్సన్ LABS రూ.1,743 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ రూ.595 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనుంది.


