News June 26, 2024

విపరీతంగా పెరిగిపోతున్న కూరగాయల ధరలు

image

నగరంలో కాయగూరలు ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్‌లో రెండు మూడు రకాలు మినహా దాదాపు అన్నీ కిలో రూ.40 కి చేరాయి. బహిరంగ మార్కెట్‌లో అయితే అదనంగా మరొక రూ.20 బాదుతున్నారు. దొండ రూ.28 రూపాయలు, క్యాబేజీ రూ.30, బీట్రూట్ రూ.32, క్యారెట్ రూ.38, బెండ రూ.34, వంకాయలు తెల్లవి రూ.44, నల్లవి రూ.54, టమాటా రూ.64, బరబాటి రూ.54, బీన్స్ రూ.120, అల్లం రూ.160 బంగాళదుంపలు రూ.32 ఉల్లిపాయలు రూ.36 గా ధర పలుకుతున్నాయి.

Similar News

News November 12, 2025

ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన వివరాలు

image

ఈనెల 14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.30 ఎయిర్ పోర్టు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో కలసి ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 8.55కు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15కు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 12, 2025

విశాఖలో మరో ఐటీ క్యాంపస్‌‌ ఏర్పాటు

image

విశాఖలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. కాపులుప్పాడలో రూ.115 కోట్లతో.. 2,000 మందికి ఉద్యోగాలిచ్చే విధంగా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AIML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీతో క్యాంపస్ నిర్మించనున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున, 4 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది.

News November 12, 2025

విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

image

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.