News March 21, 2025

వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఎం ఫార్మసీ (పీసీఐ) మొదటి, రెండు, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

Similar News

News December 1, 2025

హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

image

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.

News December 1, 2025

HYD: రాజ్ భవన్.. లోక్ భవన్‌గా మారనుందా?

image

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్‌భవన్‌గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లోని రాజ్‌భవన్‌లు లోక్‌భవన్‌గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్‌భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.

News December 1, 2025

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులు అవస్థలు

image

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూడు లైన్ల రోడ్లు ఉన్నా సరే నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని దినాలు ఉండటంతో ఆ సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్‌లోనే పోగొట్టుకుంటున్నామని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధ పడుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.