News April 17, 2024
వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
News November 18, 2025
HYD: YCP అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్ట్

YCP కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు అయ్యారు. కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉ.7 గం.కు పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు సమయంలో భయభ్రాంతులకు గురిచేసి, ఫోన్లు లాక్కొని అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. ప్రస్తుతం తాడిపత్రికి తరలిస్తున్నారు. స్థానిక పార్టీ నేతలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?


