News March 20, 2024
విశాఖకు చేరుకున్న ఐపీఎల్ జట్ల ప్రతినిధులు

విశాఖ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్ గంగూలి, డేవిడ్ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Similar News
News February 26, 2026
రుషికొండ: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి యువకుడి మృతి

రుషికొండ సమీపాన బేపార్క్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన స్వప్నిల్ చౌహాన్ (25) స్నేహితులతో కలిసి విశాఖ వచ్చాడు. గురువారం మధ్యాహ్నం బీచ్ వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 26, 2026
విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.
News February 26, 2026
విశాఖ: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి’

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం చేరవేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్ను సంబంధిత అధికారులతో కలిసి గురువారం విశాకలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు పారదర్శకత, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.


