News March 10, 2025

విశాఖపట్నం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన* భీమలి: గుండెపోటుతో టీచర్ మృతి * కూటమి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: గుడివాడ అమర్నాథ్ * విశాఖ: హోటల్లో మహిళ మృతి.. నిందితుడి అరెస్ట్ * విశాఖ: యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక *అసెంబ్లీ, పార్లమెంట్లో మాట్లాడిన విశాఖ MLA, MPలు

Similar News

News March 11, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 11, 2025

విశాఖ ఎదగడానికి పోర్టే కారణం: సీఐటీయూ 

image

విశాఖ అభివృద్ధిలో పోర్టు కీలకపాత్ర పోషిందని సీఐటీయూ నాయకులు అన్నారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే విశాఖ ఈరోజు మహానగరంగా ఆవిర్భవించడానికి పోర్టే కారణమన్నారు. ఈ సంవత్సరం రూ.800 కోట్లు, గతేడాది రూ.386 కోట్లు లాభాలతో నడుస్తుందని వెల్లడించారు. నేటికి కూడా రూ.171.42కోట్లు వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం ఆర్జిస్తుండగా.. పోర్ట్ హాస్పిటల్‌ను అమ్మడం దారుణమన్నారు. ఈమేరకు రిలే నిరాహార దీక్షలో వారు మాట్లాడారు.

News March 11, 2025

ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

image

విశాఖలోని మేఘాలయ హోటల్‌లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌‌ను రిమాండ్‌కు తరలించారు.   

error: Content is protected !!