News June 23, 2024

విశాఖపట్నం: మూడు జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం ఏర్పాటు

image

విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు కోన.ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్రసంఘం & APJAC కలిసి పనిచేయుటకు తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. వీఆర్వోల సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. మూడు జిల్లాల VROల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.