News March 11, 2025
విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.
Similar News
News March 12, 2025
గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 12, 2025
విశాఖ: అమ్మతో పేగు బంధం.. భగవంతుడితో అనుబంధం..!

జన్మనిచ్చిన తల్లికి తండ్రి కొనిచ్చిన స్కూటర్పై దేశమంతా తిప్పి చూపించాడు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవాలయ దర్శనాలు చేపించాడు మైసూర్కు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్. తన తల్లి చూడారత్నమ్మ కోరిక మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆలయాలకు స్కూటర్ పైనే తిప్పాడు. తల్లికిచ్చిన మాట కోసం ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. వీరిద్దరూ బుధవారం విశాఖ చేరుకున్నారు.