News February 3, 2025
విశాఖలో ఆరుగురిపై PD యాక్ట్..!

రాష్ట్రంలో పలువురిపై PD యాక్ట్ అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆదివారం రాత్రి GO విడుదల చేసింది. వారిలో విశాఖకు చెందిన రావాడ జగదీశ్, రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్ కుమార్, కొలగాన పవన్ రాజ్ కుమార్, నక్కా లోకేశ్, కాండ్రేగుల లోక్ నాథ్ వీర సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఎయిర్ పోర్టు, పీఎం పాలెం, ఆరిలోవ, దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
Similar News
News February 12, 2026
ఆస్తిపన్ను బకాయిదారులపై GVMC కఠిన చర్యలు..

GVMC పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల వసూళ్ల విషయంలో GVMC కఠినంగా వ్యవహారిస్తోంది. 2025-26 సంవత్సరానికి రూ.566 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.360 కోట్లు వసూలయ్యాయి. 6 లక్షలకు పైగా మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. చెల్లింపులు లేకపోతే ఆస్తుల సీజ్కు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 60 వేల మందికి నోటీసులు పంపగా.. మరో 20 వేల మందికి కుళాయి కనెక్షన్లు కట్ చేసేందుకి రెడీ అవుతున్నారు.
News February 11, 2026
విశాఖ హోటళ్లకు పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు

మిలాన్, ఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సదస్సుల నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి హోటల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో DFMD, HHMD తనిఖీలు, CCTV నిఘా పెంచాలని ఆదేశించారు. అతిథుల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బంది వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. VVIPల భద్రతలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు
News February 11, 2026
విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారంటే?

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ జిల్లాలో 475 స్కూల్స్ నుంచి 29,238 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని DEO ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. 133 సెంటర్లను ఏర్పాటు చేయగా.. ఒకసారి ఫెయిల్ అయిన 1305 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని, FEB-12 లోగా HMలను సంప్రదించాలన్నారు.


