News April 7, 2025
విశాఖలో ఏసీబీ దాడులు

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యడెండ్గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2025
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 1606 దరఖాస్తులు: జేసీ

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఆన్ లైన్లో 1606 దరఖాస్తులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. దరఖాస్తులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఉందని అన్నారు. 2019 అక్టోబర్ 15కి ముందు ఉన్న ఆక్రమణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దరఖాస్తుదారులు.. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, నీటి చార్జీ రసీదులను సమర్పించాలన్నారు.
News April 16, 2025
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించనున్న విశాఖ ఎంపీ

డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం విశాఖ కలెక్టర్ ఆఫీసులో గురువారం జరగనుందని దిశా కన్వీనర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ సమీక్షిస్తారని వెల్లడించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని కోరారు.
News April 16, 2025
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలించిన విశాఖ సీపీ

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం పర్యవేక్షించారు. గోశాల జంక్షన్ వద్ద పార్కింగ్, ఘాట్ రోడ్లో మలుపులు, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో స్టాప్ బోర్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు విశాలంగా ఉండాలని సూచించారు.