News January 30, 2025

విశాఖలో కేంద్రమంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం

image

విశాఖలో కేంద్రమంత్రి కుమార్‌ స్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. షీలా నగర్ వద్ద 8 కార్ల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతినగా మంత్రులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 25, 2025

సంగారెడ్డి సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలోని 613 పంచాయతీలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 271 స్థానాలు జనరల్‌కు కేటాయించగా అందులో 130 మహిళలకు, 141 పురుషులకు కేటాయించారు. బీసీలకు మొత్తం 1117కు పురుషులకు 65, మహిళలకు 52, ఎస్సీలో మొత్తం 126 స్థానాలకు పురుషులకు 70 మహిళలకు 56, ఎస్టీ కేటగిరీలో మొత్తం 18 స్థానాలకు పురుషులకు 12 మహిళలకు 6 స్థానాలు కేటాయించారు.

News November 25, 2025

ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

image

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

News November 25, 2025

VKB: పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి డీసీసీ ఇస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా!

image

పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఇస్తే.. తాను తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేస్తానని ఓ ప్రముఖ నాయకుడు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డికి డీసీసీ పదవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఆయన గట్టిగా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.