News March 27, 2025
విశాఖలో కేజీ మామిడికాయల రేటు ఎంతంటే?

విశాఖలోని 13 రైతుబజార్లలో గురువారం నాటి కూరగాయ ధరలను అధికారులు విడుదల చేశారు.(రూ/కేజీలలో) టమటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళా దుంపలు రూ.16, వంగ రూ.26/32, బెండ రూ.30, బీర రూ.42, మిర్చి రూ.26, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.24, బరబాట రూ.22, పొటాల్స్ రూ.54, కీర రూ.22, గ్రీన్ పీస్ రూ.54, మామిడికాయలు రూ.42, బద్ధ చిక్కుడు రూ.56, చీమదుంప రూ.30, కాకర రూ.32, బీట్ రూట్ రూ.24, క్యాప్సికమ్ రూ.38గా నిర్ణయించారు.
Similar News
News October 28, 2025
అవసరమైతే బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. విశాఖలో 58 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. మేఘాద్రి గడ్డ దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలని కోరారు.
News October 27, 2025
ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్ఐ, సచివాలయ సెక్రటరీ

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 27, 2025
రుషికొండ బీచ్లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అడిషనల్ ఎస్పీ మధుసూదన్ పరిశీలించారు. బీచ్ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


