News July 7, 2024

విశాఖలో జగన్నాథ స్వామి 1,008 వంటకాలతో నైవేధ్యం

image

విశాఖలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉడా పార్కు నుంచి సిరిపురంలో గురజాడ కళాక్షేత్రం వరకు ఘనంగా సాగింది. దారిపొడవునా జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్నాథ స్వామికి 1,008 వంటకాలతో నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.

Similar News

News October 11, 2024

భీమిలిలో మానసిక రోగిపై అత్యాచారం..!

image

భీమిలికి చెందిన ఓ మానసిక రోగిపై ఈనెల 3న అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో మతిస్థిమితం లేని అమ్మాయిని ఓ యువకుడు స్కూటీపై గొట్లాం తీసుకువెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. స్కూటీని ఆమెను స్థానికులు గమనించి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భీమిలి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

News October 11, 2024

విశాఖ: ‘విన్యాసాలతో బంధం బలోపేతం’

image

ఇండో పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్యం, భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖ నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. విశాఖ తీరంలో నిర్వహిస్తున్న మలబార్-2024 విన్యాసాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ విన్యాసాలతో ఆయా దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుందని వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు.

News October 11, 2024

విద్యుత్ కాంతుల వెలుగులో శంఖు, చక్ర నామాలు

image

వరహా లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సింహగిరిపై (సింహాచలం) స్వామి వారి శంఖు, చక్ర, నామాలు విద్యుత్ దీప కాంతులతో వెలుగొందుతున్నాయి. దాతల సహాకారంతో నిర్మించిన చేపట్టగా శంఖు, చక్ర, నామాలు ఎట్టకేలకు గురువారం ప్రారంభించారు. విద్యుత్ దీప కాంతులతో అద్భుతంగా దర్శనమిస్తున్న తిలకిస్తున్న భక్తులు ఆనందంతో పులకించి పోతున్నారు.