News July 7, 2024
విశాఖలో జగన్నాథ స్వామి 1,008 వంటకాలతో నైవేధ్యం

విశాఖలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉడా పార్కు నుంచి సిరిపురంలో గురజాడ కళాక్షేత్రం వరకు ఘనంగా సాగింది. దారిపొడవునా జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్నాథ స్వామికి 1,008 వంటకాలతో నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
Similar News
News December 18, 2025
విశాఖ: సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
News December 18, 2025
కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 18, 2025
కలెక్టర్ల సద్దస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్, సీపీ

రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశంలో విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీపీ శంకబ్రత బాగ్చి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.


