News March 7, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ చేసిన నేతలు ➤ ఏప్రిల్ 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం ➤ హనుమంతువాకలో యాక్సిడెంట్ ఒకరు మృతి ➤ మల్కాపురం పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం ➤ ఏయూ వీసీతో నన్నయ్య యునివర్సిటీ వీసీ భేటీ ➤ విశాఖలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ➤ ఏయూను సందర్శించిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యురాలు
Similar News
News March 9, 2025
విశాఖ: ఇన్ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

విశాఖలో శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 8, 2025
విశాఖ: ఆల్-ఉమెన్ క్రూ స్పెషల్ రైలు ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశాఖ రైల్వే స్టేషన్ లో ఆల్-ఉమెన్ క్రూ స్పెషల్ రైలును శనివారం ప్రారంబించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ వాల్తేర్ డివిజన్ అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిగా మహిళా సిబ్బందితో ఈ రైలు ప్రయాణం చేస్తుందన్నారు. విశాఖపట్నం స్టేషన్లో పలువురు మహిళా స్వచ్ఛ సేవకులను సత్కరించారు.
News March 8, 2025
విశాఖ: హోటల్లో మహిళ అనుమానాస్పద మృతి

నగరంలోని ఓ హోటల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈమె మేఘాలయ హోటల్లో రూమ్ తీసుకొని ఉరివేసుకొని మృతి చెందగా యాజమాన్యం ఫిర్యాదు మేరకు శనివారం అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఈమె ఎవరు ఎలా మృతి చెందింది అనే విషయం తేలాల్సి ఉంది. రిటన్ సీఐ రమణయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.