News July 11, 2024
విశాఖలో డ్యూక్ బైక్ ఢీ.. మరొకరు మృతి

విశాఖలో <<13598823>>డ్యూక్ బైక్<<>>తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్కు స్వల్పగాయాలయ్యాయి.
Similar News
News October 25, 2025
విశాఖ మత్స్యకారులకు గమనిక

తుఫాను ఏర్పడిన నేపథ్యంలో సముద్రంపై మత్సకారులకు వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు సూచించారు. బీచ్ రోడ్డులోని జాలరిపేట వద్ద తుఫాన్ విషయంపై ముందస్తు జాగ్రత్తలు వివరించారు. సముద్రంలో వేట సాగిస్తున్న ఫిషింగ్ బోట్లు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. తీరంలో భద్రపరచుకున్న సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. సమస్య ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.
News October 25, 2025
విశాఖలో సెలవులు రద్దు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, పెనుగాలుల ప్రమాదం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
News October 25, 2025
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


