News November 10, 2024

విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణం..!

image

విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బీచ్ రోడ్డులో ఐకానిక్ తాజ్ గేజ్ వే హోటల్ స్థానంలో వరుణ్ గ్రూప్ దీన్ని నిర్మించనుంది. రూ.600 కోట్లతో 24 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్, హోటల్, స్టూడియో నిర్మిస్తారు. రూ.120 కోట్లతో తాజ్ గేట్ వే హోటల్‌ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈనెల 14 నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

Similar News

News October 17, 2025

విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

image

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్‌పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

News October 16, 2025

విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

image

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్‌లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్‌ జంప్, ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్‌ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

News October 16, 2025

విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

image

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.