News November 18, 2024
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

విశాఖలో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయసంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాలో రాధాకృష్ణన్కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకొని సదస్సును ప్రారంభించనున్నారు.
News November 14, 2025
విశాఖ: 2300 మందితో భద్రత

విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా సుమారు 2300 మంది(8 మంది ఐపీఎస్ అధికారులు, 8మంది ఏడీసీపీలు, 32 మంది ఏసీపీలు, 89 సీఐలు, 192 ఎస్.ఐలు, 2000(ఏ.ఎస్.ఐ,హెచ్.సి,పి.సి, హెచ్.జి)సిబ్బందితో సదస్సుకు పకడ్బందీగా భద్రతా భద్రతా ఏర్పాట్లు చేశారు.
News November 13, 2025
విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్లో ఆయనకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. అక్కడ నుంచి గవర్నర్ విడిది కేంద్రానికి వెళ్లారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నగరానికి చేరుకున్నారు.


