News November 18, 2024
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

విశాఖలో సోమవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయసంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, చేపట్టబోయే ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు సోమవారం పరిహారం అందజేసారు. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన అనకాపల్లికి చెందిన రాపేటి కొండ లక్ష్మి కుటుంబం సభ్యులకు 2లక్షలు, హిట్& రన్ కేసుల్లో గాయపడిన సీతంపేటకు చెందిన చిలకలపూడి సురేష్, గాజువాకకు చెందిన ఇమంది లక్ష్మణరావుకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేసారు. ఇప్పటివరకు 88 మందికి రూ.71 లక్షల పరిహారం అందించారు.
News November 3, 2025
విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.


