News February 26, 2025
విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్కు తరలించారు.
Similar News
News February 26, 2025
విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
News February 26, 2025
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఇవే

ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికలకు 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్ద గంట్యాడ జడ్పీ స్కూల్, గాజువాక జడ్పీ స్కూల్, పెందుర్తి గవర్నమెంట్ స్కూల్, చిన్న వాల్తేర్ ఏయూ స్కూల్, డాబాగార్డెన్స్ ప్రేమా స్కూల్, న్యూస్ కాలనీ హైస్కూల్, కంచరపాలెం పాలిటెక్నిక్, మల్కాపూరం జీవీఎంసీ స్కూల్, గోపాలపట్నం జడ్పీ స్కూల్, మధురవాడ జడ్ప స్కూల్, పద్మనాభం ఎంపీపీ స్కూల్, ఆనందపురం స్కూల్, భీమిలి మహాత్మా గాంధీ స్కూల్.
News February 26, 2025
విశాఖ: గాయపడిన యువకుడి మృతి

విశాఖలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైకు తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.