News January 28, 2025
విశాఖలో నారా లోకేశ్కు అర్జీలు

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కసింకోట నుంచి తన మూడేళ్ల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆర్థికసాయం అందించాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్ ను తొలగించారని విశాఖ సీతంపేటకు చెందిన అవ్వ కాంతం విజ్ఞప్తి చేశారు. తన తండ్రి సంపాదించిన భూమి ఆక్రమించారని విజయనగరం జిల్లా అంగటి లక్ష్మి ఫిర్యాదు చేసారు. అర్జీల పట్ల చర్యలు తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Similar News
News February 13, 2025
‘ఆ కేసులను త్వరితంగా పరిష్కరించాలి’

హిట్ & రన్ నష్ట పరిహార కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం అయ్యారు. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో సత్వరమే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కు పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం క్లెయిమ్ దరఖాస్తులలో లోపలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
News February 12, 2025
వాట్సాప్ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్

సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
News February 12, 2025
విశాఖలో హత్యకు గురైన MRO భార్యకు ఉద్యోగం

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్గా నియామక పత్రం అందించారు.