News April 22, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.
Similar News
News April 22, 2025
విశాఖ: ఈనెల 28న GVMC మేయర్ ఎన్నిక

GVMC మేయర్ పదవికి ఎన్నికను ఏప్రిల్ 28న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈనెల 24లోపు మేయర్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 28 ఉదయం 11 గంటలకు GVMCలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
News April 22, 2025
విశాఖ: మూడు నెలల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం

విశాఖపట్నంలో నిరుద్యోగ యువతకు APSSDC ఉచిత ఎయిర్ కండీషనర్ టెక్నీషియన్ శిక్షణతో పాటు ఉద్యోగాన్ని కల్పిస్తోంది. మూడు నెలల పాటు శిక్షణ కొనసాగనుందని, పదో తరగతి పాసైన 18-45 ఏళ్ల పురుషులు అర్హులుగా పేర్కొన్నారు. కంచరపాలెంలోని స్కిల్-హబ్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గలవారు https://forms.gle/fHnPd4nQnPzD24h38 ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సింహాచలం తెలిపారు.
News April 22, 2025
విశాఖ: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్తో..!

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విశాఖలో 29,997 మంది పరీక్ష రాయగా వారిలో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ స్కూల్ 1,404 మంది, 2,124 వృత్తి విద్యా పరీక్ష రాశారు. 134 సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్క క్లిక్తో వే2న్యూస్లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it