News March 16, 2025

విశాఖలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

విశాఖలో ఓ బాలిక తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. MVP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కవానిపాలెంలో ఉంటున్న రమాదేవి, సురేష్ దంపతుల కుమార్తె సాయి తనూష (16) 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడితో సన్నిహితంగా మాట్లాడడం గమనించిన తల్లి తనూషాను శుక్రవారం మందలించింది. దీంతో బాలిక రాత్రి రూములో తలుపులకు గడి పెట్టుకుంది. తల్లి తలుపులు కొట్టినా తీయలేదు. చివరకు తలుపులు పగలుకొట్టగా బాలిక ఉరివేసుకుని ఉంది.

Similar News

News February 25, 2026

తొలిరోజు ‘ఇంటర్’ ప్రశాంతం: 97 శాతం హాజరు

image

జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు పరీక్షకు మొత్తం 19,636 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 19,099 మంది (97 శాతం) పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. వీరిలో జనరల్ విభాగం నుంచి 17,989 మంది, ఒకేషనల్ నుంచి 1,110 మంది ఉన్నారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖ తెలిపింది.

News February 25, 2026

సంగారెడ్డి: 17,616 మంది విద్యార్థుల హాజరు

image

సంగారెడ్డి జిల్లాలోని 54 పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సంవత్సరం మొదటి లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 18,179 మంది విద్యార్థులకు గాను 17,616 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి గోవిందరామ్ మీడియాతో తెలిపారు. విద్యార్థుల హాజరు 96.90%గా ఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు.

News February 25, 2026

పెద్దపల్లి: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ పాఠశాలల్లో 2026-27 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ తెలిపింది. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల కేంద్రాల్లో, మార్చి 28న జిల్లా స్థాయి ఎంపిక పోటీలు పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్‌లో, 27 ఏప్రిల్ హకీంపేటలో రాష్ట్రస్థాయి ఫైనల్ ఎంపికలు జరుగుతాయని పేర్కొంది.