News March 24, 2025
విశాఖలో పలు సంస్థల డ్రైవర్లకు అవగాహన

విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల యాజమాన్యాలకు, డ్రైవర్లకు ఉప రవాణా కమీషనర్ కార్యాలయంలో ఆదివారం అవగాహనా నిర్వహించారు. డ్రైవర్ అలర్ట్ సందేశాల వెళ్ళకుండా చూడాలని యాజమాన్యనికి.. రహదారి నియమ నిభందనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించాలని సంస్థల యాజమాన్యనికి ఇన్ ఛార్జ్ ఉపరవాణా కమీషనర్ ఆర్సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News March 29, 2025
విశాఖ: టీడీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు

విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజల కష్టాలను తీరుస్తూ, దేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాస్రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గండి బాబ్జి ఉన్నారు.
News March 29, 2025
విశాఖ: ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.
News March 29, 2025
గాజువాకలో యువకుడి ఆత్మహత్య

గాజువాకలో తెల్లవారుజామున యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన వసంతుల సతీశ్ కుమార్ అనే యువకుడు విశాఖలోని ఓ ఫార్మా ల్యాబ్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చైతన్య నగర్లోని రూములో స్నేహితుడు రాజశేఖర్తో కలిసి పడుకున్నాడు. తెల్లవారుజామున ఫ్యాన్ ఆగిపోవడంతో రాజశేఖర్ లేచి చూసేసరికి సతీశ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.