News January 7, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు

image

పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలపై ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వారు ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్, ప్రధాని పర్యటించే పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వినియోగం నిషేధమని తెలిపారు. నిషేదాజ్ఞలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులకు శిక్షార్హులు అవుతారన్నారు.

Similar News

News November 4, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News November 4, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు సోమవారం పరిహారం అందజేసారు. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన అనకాపల్లికి చెందిన రాపేటి కొండ లక్ష్మి కుటుంబం సభ్యులకు 2లక్షలు, హిట్& రన్ కేసుల్లో గాయపడిన సీతంపేటకు చెందిన చిలకలపూడి సురేష్, గాజువాకకు చెందిన ఇమంది లక్ష్మణరావుకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేసారు. ఇప్పటివరకు 88 మందికి రూ.71 లక్షల పరిహారం అందించారు.

News November 3, 2025

విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

image

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్‌పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.