News January 8, 2025
విశాఖలో ప్రధాని సభకు వెళ్తున్నారా?
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్షో, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలు తమ వెంట కేవలం సెల్ ఫోన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మరే ఇతర బ్యాగులు, వస్తువులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెచ్చినట్లయితే తమ వాహనాల్లో భద్రపరుచుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. >Share it
Similar News
News January 22, 2025
జువైనల్ హోమ్ ఘటనపై స్పందించిన హోం మంత్రి
విశాఖలోని జువైనల్ హోమ్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్తో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి, తహశీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ని ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమని తెలితే కఠిన చర్యలు తప్పవన్నారు.
News January 22, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.
News January 22, 2025
అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!
చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.