News November 11, 2024

విశాఖలో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. ప్రజల నుంచి వినతులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్, ఆర్డీవో పి. శ్రీలేఖ, ఏడీసీ వర్మ స్వీకరిస్తున్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు.

Similar News

News October 27, 2025

రుషికొండ బీచ్‌లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్‌ ప్రాంతాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, అడిషనల్‌ ఎస్పీ మధుసూదన్‌ పరిశీలించారు. బీచ్‌ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

News October 27, 2025

విశాఖ: మొంథా తుఫాను.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది

image

మొంథా తుఫానుపై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని DMHO జగదీశ్వరరావు అప్రమత్తం చేశారు. 54 హెల్త్ వెల్‌నెస్, 66 పట్టణ, 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంచినీటి వనరులను బ్లీచింగ్ చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏడు 104, పదహారు 108, ఇరవై మూడు 102 తల్లి బిడ్డ వాహనాలను తుఫాను ప్రాంతాల్లో ఫిషెర్మెన్ డిపార్ట్మెంట్‌తో కలిసి బోట్ క్లీనిక్స్‌గా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

News October 27, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేపు సెలవు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల రద్దు చేశారు. విద్యార్థులను హాస్టల్స్‌కు పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత పెరగడం, వర్షం అధికమవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులకు సైతం రేపు సెలవు ప్రకటించారు.