News March 29, 2025
విశాఖలో ప్రేమ పేరుతో మోసం

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News October 31, 2025
GNT: తెలుగులో ఏపీ రాజకీయ చరిత్ర రచించిన గొప్ప వ్యక్తి

రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు తెలుగులో రచించిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబర్ 31న చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్ రచనలు ఆయన తెలుగులో అనువదించగా, తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు. ఈయన జాతీయ హేతువాద సంఘంకి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1954 నుంచి పదేళ్ల పాటు “ప్రజావాణి” పత్రికలో పనిచేశారు.
News October 31, 2025
మంత్రివర్గంలోకి మరో ఇద్దరు!

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.
News October 31, 2025
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ద్రాక్ష

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.


