News April 11, 2024

విశాఖలో ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు విస్తరణ

image

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను విశాఖలో విస్తరించనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖలో గ్రోసరీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న జీ.ఎఫ్.సీ ద్వారా స్థానికులు వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

Similar News

News March 17, 2025

భీమిలి ఎమ్మెల్యేను కలిసిన స్టార్ డైరెక్టర్

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ, ఎం.వి.పి.కాలనీలోని ఆయన స్వగృహంలో స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి టీం ఆదివారం కలిశారు. ప్రస్తుత సినిమాలు గురించి, మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించనున్న కొత్త సినిమా గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. కొత్త చిత్రాన్ని తెరకెక్కించే ముందు, ఆ కథతో వచ్చి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అని అన్నారు.

News March 17, 2025

విశాఖ నుంచి HYD ట్రావెల్స్ బస్సులో మంటలు

image

విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం స్వల్పమే అయినప్పటికీ బస్సు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయంగా రావాల్సిన బస్సు రెండు గంటలు కావస్తున్నా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా నక్కపల్లి హైవేపై చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా వెనక చక్రాల డమ్ములు గట్టిగా పట్టేయడంతో స్వల్ప మంటలు చేలరేగాయి. ఈ ఘటన 9 గంటలకు జరిగింది.

News March 16, 2025

విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

image

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!