News December 13, 2024

విశాఖలో యువకుడి మృతిపై స్పందించిన మంత్రి లోకేశ్

image

విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్‌యాప్ వేధింపులకు బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ల కాన్ఫిరెన్స్‌లో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. యువకుడి ఫొటోతో పాటు అతని భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి ఆత్మహత్యకు కారణమయ్యారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించారు. దీనిపై చిట్టా బయటకు తీస్తామని విజిలెన్స్ డీజీ తెలిపారు.

Similar News

News October 20, 2025

విశాఖలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె

image

వాల్తేరు డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు డిపోకు చెందిన 29 బస్సులు నిలిచిపోయాయి. కార్యదర్శి బి.జంపన్న మాట్లాడుతూ.. రూ.26,000కి జీతం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, దసరా బోనస్, రెండు జతల బట్టలు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.18వేల జీతంతో జీవనం కష్టంగా ఉందని వాపోయారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

News October 19, 2025

విశాఖ: రేపు కలెక్టరేట్‌లో PGRS రద్దు

image

దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వచ్చేవారం యథావిధిగా వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News October 19, 2025

21న విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 4:35 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కి వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జీవీఎంసీలో జరిగే రివ్యూలో పాల్గొని ఆరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైన్‌లో బయలుదేరి ఒంగోలు వెళ్తారు.