News March 30, 2024
విశాఖలో యువతి సూసైడ్..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711766430216-normal-WIFI.webp)
విశాఖ మధురవాడలో శుక్రవారం యువతి(17) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొమ్మాదిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్లోని 4వ అంతస్తు నుంచి దూకేసింది. కాలేజీ ఫ్యాకల్టీ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆత్మహత్యకు ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసినట్లు సమాచారం. మృతురాలి తండ్రి నాతవరం మండలానికి చెందిన వ్యవసాయం కూలీ. యువతి ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News January 14, 2025
విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736779924378_20522720-normal-WIFI.webp)
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. నేడు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 13, 2025
రేపు విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736779924378_20522720-normal-WIFI.webp)
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రేపు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. రేపు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 13, 2025
నర్నీపట్నం: కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736766860328_51739701-normal-WIFI.webp)
నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల ప్రిన్సిపల్ శాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు సర్వ శిక్షా అభియాన్ ఏపీడి జయప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన సమయంలో సమాచారాన్ని ఒక రోజు ఆలస్యంగా అధికారులకు చెప్పడాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.