News October 25, 2024
విశాఖలో రంజీ మ్యాచ్కి ఉచిత ప్రవేశం

విశాఖ పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను స్టేడియంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సెషన్లో ఆంధ్రా జట్టు, మధ్యాహ్నం సెషన్లో హిమాచల్ ప్రదేశ్ జట్టు నెట్ ప్రాక్టీస్ చేశాయి. రంజీ మ్యాచ్లను తిలకించేందుకు క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News January 8, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్లోని ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 8, 2026
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
News January 8, 2026
విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.


