News April 2, 2024

విశాఖలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

విశాఖలో బుధవారం జరగనున్న ఐపీఎల్ టీ-20 మ్యాచ్ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 12:00 వరకు భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్ళాలి.

Similar News

News October 27, 2025

SKLM: నేడు ప్రజా ఫిర్యాదులు, నమోదు కార్యక్రమం రద్దు

image

ఈనెల 27న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరగనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలియజేశారు. మండలాల్లో సైతం నిర్వహించనున్న గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

News October 26, 2025

శ్రీకాకుళం: విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు

image

జిల్లాలోని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం తెలిపారు. తుపాన్ కారణంగా ఈనెల 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామన్నారు. మూడు రోజుల పాటు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు బయట తిరగొద్దని సూచించారు.

News October 26, 2025

కోటబొమ్మాళి: బావిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

image

కోటబొమ్మాళి మండలం ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరి నాయుడు ఆదివారం బావిలో పడి మరణించాడు. స్థానికుల వివరాల మేరకు.. గౌరి నాయుడు ఆదివారం బావిలోకి స్నానం చేసేందుకు దిగి అస్వస్థతకు గురయ్యాడు. 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.