News January 31, 2025

విశాఖలో సర్వర్ డౌన్‌తో అవస్థలు

image

విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్‌తో అవస్థలు పడుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం భూమి విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజువారి రిజిస్ట్రేషన్ల కంటే శుక్రవారం మరింత ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆసక్తి చూపారు. మరోపక్క సర్వర్లు మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాత్రి 12 వరకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Similar News

News February 1, 2025

మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్‌లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్‌‌, విటుడు పెందుర్తికి చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News February 1, 2025

విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు

image

వాల్తేర్ డివిజన్‌లో సాంకేతిక కారణాల వల్ల విశాఖ -పలాస పాసింజర్ రైళ్ల గమ్యం కుదింపు చేసినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పలాస (67289/90)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 1, 2025

విజయనగరం వరకే విశాఖ-పార్వతీపురం ట్రైన్ 

image

వాల్తేర్ డివిజన్‌లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.