News February 13, 2026

విశాఖలో సహజీవనం.. ప్రియుడిని చంపిన ప్రియురాలు

image

ఆనందపురం శివారు పందుల ఫారంలో జరిగిన <<19116438>>హత్య<<>> కేసులో నిందితురాలు షేక్ ముబీనా అలియాస్ శ్రావణి (41)కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరానికి చెందిన నాగశివ (36)తో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఆవు అమ్మకం డబ్బుల విషయంలో గొడవ, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Similar News

News March 9, 2026

జగిత్యాల: ఆదర్శలో ప్రవేశాలకు రేపటికే చివరి గడువు

image

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి తోపాటు 7వ, 8వ, 9వ, 10వ తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుంది. 6వ తరగతిలో మొత్తం సీట్ల భర్తీకి మిగిలిన తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల గడువు గత నెల 28కే ముగియగా ప్రభుత్వం పది రోజుల పాటు గడువు పొడిగించింది. కాగా, ఆ గడువు సైతం రేపటితో ముగియనుంది.

News March 9, 2026

రేపు కదిరి తేరు.. రథం కదిలేది ఎప్పుడంటే?

image

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మరథోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో <<19334160>>రథం<<>> కదలనుందని వేదపండితులు తెలిపారు. భక్తజన సందోహం మధ్య గోవింద నామస్మరణతో కదిరి పురవీధులు మారుమోగనున్నాయి. ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్నారు.

News March 9, 2026

ఖమ్మం: వ్యాపారం ముసుగులో ఖాకీ కుటుంబం మోసం

image

ఖమ్మం జిల్లాలో ఓ పోలీస్ అధికారి కుటుంబం స్నేహం పేరుతో ఓ యువకుడిని మత్తుకు బానిసగా మార్చి, రూ.3 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపార నష్టం సాకుతో, బెదిరింపులకు పాల్పడి కలెక్టరేట్ సమీపంలోని ఆస్తిని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. న్యాయం చేయాలని ఉన్నత అధికారులను బాధిత కుటుంబం కోరుతోంది. ఈ ఘటన పోలీస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.