News October 31, 2024

విశాఖలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు 

image

న‌వంబ‌ర్ 02న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్, పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సీఎం హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యే కోస్ట‌ల్ బ్యాట‌రీ ప్రాంతాన్ని గురువారం ప‌రిశీలించారు. కోస్ట‌ల్ బ్యాట‌రీ వ‌ద్ద‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం చేరుకొని అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా క‌లెక్ట‌రేట్‌కు వస్తారని అన్నారు.

Similar News

News November 23, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 23, 2025

విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

image

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.