News March 2, 2025
విశాఖలో స్పా సెంటర్పై దాడి.. ఏడుగురి అరెస్ట్

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్లో దాడులతో మిగతా స్పా సెంటర్లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 11, 2026
పండగపూట ప్రయాణ కష్టాలు.. రెండేళ్లు దాటినా తీరని అగచాట్లు!

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. HYD, NLG నుంచి APకి వెళ్లే వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, ప్రధాన రహదారుల మరమ్మతులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగ పూట ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ఇప్పటికైనా సర్కారు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
News January 11, 2026
శ్రీ సత్యసాయి: పండుగ పూట విషాదాంతం

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. హిందూపురం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఫర్హాన్(30), అమరాపురం(M) చిట్నడుకు చెందిన సురేశ్(35) రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నల్లమాడ(M) కుటాలపల్లిలో బహిర్భూమికి వెళ్లిన సాయిసంకీర్తన(17), పెనుకొండలో స్నానానికి వెళ్లిన విజయేంద్ర కుమార్(53) నీటిలో మునిగి చనిపోయారు. చెన్నేకొత్తపల్లి(M) నామాలకు చెందిన వెంకటేశ్వరరెడ్డి కూతురి కోసం TPT వెళ్లి మృత్యువాత పడ్డారు.
News January 11, 2026
రాబోయే 3 రోజులు గజగజ

TG: రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. పొగమంచు, చలి గాలుల తీవ్రతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు చలి మరింత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


