News March 2, 2025
విశాఖలో స్పా సెంటర్పై దాడి.. ఏడుగురి అరెస్ట్

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్లో దాడులతో మిగతా స్పా సెంటర్లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 25, 2025
ప్రియుడి కోసం.. పెళ్లైన 2 వారాలకే భర్తను చంపించిన భార్య

భర్తలను భార్యలు చంపేస్తున్న/చంపిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మీరట్ కేసు మరువక ముందే UP, మైన్పురి జిల్లాలో మరో ఘోరం జరిగింది. బలవంతపు పెళ్లి, ప్రియుడిపై ఇష్టంతో పెళ్లైన 2 వారాలకే భర్త దిలీప్ యాదవ్ను కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించింది ప్రగతీ యాదవ్. తన భర్త వద్ద బాగా ఆస్తి ఉందని, చంపేశాక సుఖంగా బతకొచ్చని ప్రియుడికి చెప్పింది. దిలీప్ శవం దొరికాక పోలీసుల దర్యాప్తుతో ప్రగతి ప్లాన్ బయటకొచ్చింది.
News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 25, 2025
సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయిల్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.