News September 27, 2024

విశాఖలో హై లెవెల్ కమిటీ సమావేశం

image

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలోని నోవాటెల్‌లో అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఆ కమిటీ ఛైర్‌పర్సన్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కార్మిక శాఖ కార్యదర్శి ఏం.ఏం.నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలపై వీరు సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు.

Similar News

News November 24, 2025

విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

image

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్‌లోనూ eChallan & icon enable చేశారు. యాప్‌లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్‌ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.

News November 24, 2025

విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

News November 24, 2025

విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

image

విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.