News February 16, 2025
విశాఖలో IPL.. మ్యాచ్లు ఎప్పుడంటే..?

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్లను ఈ సీజన్లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ తలపడనుంది.
Similar News
News November 10, 2025
బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధిత బిల్లుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతామని CM హిమంత బిస్వ శర్మ తెలిపారు. దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
News November 10, 2025
నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం
1848: జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ జననం
1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం
1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం (ఫొటోలో)
1993: కథా రచయిత రావిశాస్త్రి మరణం
* ప్రపంచ సైన్స్ దినోత్సవం
News November 10, 2025
బిహార్: 122 స్థానాల్లో 1,302 మంది బరిలోకి

బిహార్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 136 మంది మహిళలు కావడం గమనార్హం. 45,399 కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ 122 స్థానాల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.


