News July 17, 2024
విశాఖ: అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం

విశాఖ నగరంలో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మొదటి రోజు విశాఖ – రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్కు దిగిన విశాఖ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. అనంతరం నార్త్ జోన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. విశాఖ జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Similar News
News November 18, 2025
కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.
News November 18, 2025
కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.
News November 18, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.


