News July 14, 2024
విశాఖ అధికారులకు మంత్రి పవన్కళ్యాణ్ ఆదేశాలు

విశాఖ <<13613533>>ముడసర్లోవ<<>> పార్కు పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టవద్దని జీవీఎంసీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఏ.ఎస్ శర్మ లేఖపై స్పందించిన ఆయన.. జీవీఎంసీ అధికారులను వివరణ కోరారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
విశాఖలో సీఐల బదిలీ: సీపీ

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్కు, సీసీఎస్లో ఉన్న సీఐ శంకర్నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్కు, రేంజ్లో ఉన్న వరప్రసాద్ను వన్టౌన్ స్టేషన్కు, సీపోర్టు ఇమిగ్రేషన్లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్కు, సిటీ వీఆర్లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు.
News October 25, 2025
నాగుల చవితి సందర్భంగా VMRDA పార్కుల్లో ఉచిత ప్రవేశం

నాగుల చవితి పండగ సందర్భంగా నగరవాసుల సౌకర్యార్థం శనివారం VMRDA పరిధిలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీచ్ రోడ్ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
News October 24, 2025
విశాఖ: రోజ్గార్ మేళాలో యువతకు నియామక పత్రాల అందజేత

ఉడా చిల్డ్రన్ ఏరియాలో శుక్రవారం రోజ్గార్ మేళా నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఉద్యోగాలు సాధించిన 100 మంది యువతకు ప్రభుత్వ శాఖలలో నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 51వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు ఈరోజు అందజేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.


