News December 19, 2024

విశాఖ: ‘అధికారులు చురుకైన పాత్ర పోషించాలి’

image

విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పంచాయతీరాజ్ కమీషనర్ వి.ఆర్ కృష్ణ తేజ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో 100% చురుకైన పాత్ర పోషించాలని, ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని విశాఖ, అనకాపల్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యనిర్వహణాధికారి, అధికారులు ఉన్నారు.

Similar News

News October 28, 2025

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విశాఖ కలెక్టర్ పర్యటన

image

విశాఖలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కైలాసపురం, శాంతి నగర్, కస్తూరి నగర్, మాధవధార అంబేద్కర్ కాలనీలో కొండచరియలు ఇళ్లపై పడడంతో పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 28, 2025

విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

image

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.

News October 28, 2025

విశాఖ రానున్న మంత్రి గొట్టిపాటి

image

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.