News January 31, 2025
విశాఖ: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీరప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్లో ఈ ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్గా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 23, 2025
వరంగల్: మద్యం టెండర్లకు నేడే ఆఖరు..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం దరఖాస్తులు చేసుకునే వారికి నేడే చివరి అవకాశం అని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 294 వైన్ షాపులకు గడువు పెంచిన నాటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో బుధవారం వరకు 25 దరఖాస్తులు వచ్చాయి. నేడే చివరి రోజు కావడంతో ఔత్సాహికులు భారీగానే వస్తారని ఊహిస్తున్నారు.
News October 23, 2025
తాండూర్: ఫేక్ వీడియో కాల్స్తో మోసాలు.. జాగ్రత్త: డీఎస్పీ

నకిలీ వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దని ప్రజలకు సూచించారు. కొందరు వ్యక్తులు నగ్నంగా మాట్లాడి, ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ ఫిర్యాదుల కోసం ‘1930’కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు.
News October 23, 2025
RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.