News March 29, 2024
విశాఖ: అప్పన్న తలనీలాల వేలం రూ.10.13 కోట్లు

సింహాచలం దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు గురువారం వేలం నిర్వహించారు. 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల 13 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన దొరై ఎంటర్ప్రైజస్ దీనిని సొంతం చేసుకుంది. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఈవో పాలూరి నరసింగరావు, ఏఈ రాంబాబు, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు వేలం నిర్వహించారు.
Similar News
News December 16, 2025
విశాఖలో ఐదుగురు ఎస్ఐలను రేంజ్కు అప్పగింత

విశాఖ నగరంలో ఐదుగురు ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ శంఖ బత్రబాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ విజయ్కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్కు అప్పగించారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.
News December 16, 2025
పోర్టు కళావాణి స్టేడియం స్వాధీనం చేసుకున్న యాజమాన్యం

అక్కయ్యపాలెం జాతీయ రహదారి కానుకొని ఉన్న పోర్టు కళా వాణి ఆడిటోరియం లీజు ఒప్పందాలను రద్దు చేసినట్లు విశాఖ పోర్ట్ అథారిటీ యాజమాన్యం ప్రకటించింది. క్రీడా సముదాయం గతంలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించామని లీజ్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు పాటించకపోవడంతో రద్దుచేసి నోటీసులు జారీ చేశామని పోర్టు యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో స్టేడియం స్వాధీనం చేసుకున్నారు.
News December 16, 2025
స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు

విశాఖ స్టీల్ ప్లాంటు హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు19వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా..24 గంటల్లో 21,012 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బ్లాస్ట్ ఫర్నేస్–1 నుంచి 7,058 టన్నులు, ఫర్నేస్–2 నుంచి 6,558 టన్నులు, ఫర్నేస్–3 నుంచి 7,396 టన్నులు ఉత్పత్తిచేసి గత రికార్డును అధిగమించారు.


