News August 6, 2024
విశాఖ: ఆన్లైన్ క్విజ్.. ప్రైజ్మనీ రూ.40వేలు
ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Similar News
News October 1, 2024
అండర్-17 రాష్ట్రస్థాయి పోటీలు: ఖోఖోలో విజేతగా విశాఖ జట్టు
వినుకొండ లయోలా హైస్కూల్లో జరుగుతున్న అండర్-17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఖోఖోలో విశాఖ జట్టు విజేతగా నిలవగా, రన్నరప్ స్థానాన్ని అనంతపురం దక్కించుకుంది. ఫుట్బాల్లో వైఎస్ఆర్ కడప విజయం సాధించగా.. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాల్బ్యాడ్మింటన్లో గుంటూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేతలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బహుమతులను ప్రదానం చేశారు.
News October 1, 2024
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ
అంతర్జాతీయ కాఫీ డే సంధర్బంగా.. కాఫీ అంటే గుర్తొచ్చే మన బ్రాండ్ అరకు కాఫీ. దీనికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీని మెచ్చుకున్నారు. ఏజెన్సీలో అటవీశాఖ, కాఫీ బోర్డు కలిసి 1970లో సాగును ప్రారంభించింది. 1974 నుంచి ITDA రైతులతో కాఫీ పంట సాగును ప్రారంభించింది. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్లో 1.40 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు.
News October 1, 2024
స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏ.కే.సక్సేనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా పనిచేస్తున్న సక్సేనా స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్లాంట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత కర్మాగారాన్ని సందర్శించారు.